బచ్చన్నపేట సెప్టెంబర్ 23 ప్రజా జ్యోతి: జనగామ జిల్లా బచ్చన్నపేటపి ఆర్ టి యు టి ఎస్. మండల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా అధ్యక్షులు కొల్ల మహిపాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి నుకల ఎల్లారెడ్డి హాజరు అయ్యారు ఈ సందర్భముగా జిల్లా అధ్యక్షులు కొల్ల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు త్వరలోనే ప్రమోషన్స్ బదిలీలలు చేపట్టాలని తెలియజేశారు .ప్రధాన కార్యదర్శి నూకల ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఇంచార్జీ ల పాలలో సతమతం అవుతున్నాయని, పర్యవేక్షణ అధికారులు లేక వ్యవస్థ నీరుగారే పరిస్థితులు ఉన్నాయని ,వెంటనే మిగిలి పోయిన 317 అప్పీల్లను వెంటనే క్లియర్ చేయాలని మరియు మరొక్కసారి పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలని ,పెండింగ్ డి ఏలను వెంటనే విడుదల చేయాలని తెలియజేశారు అదే విదంగా ఈ రోజు మండలంలోని అన్ని పాఠశాలల్లో అపూర్వ స్పందన లభించినది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బి సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఇ సంతోష్ కుమార్ ,రాష్ట్ర బాధ్యులు యాదగిరి,కేశవరావు, వెంకట కృష్ణ,నాగరాజు,రాంరెడ్డి,వెంకటేశ్వర్లు,చంద్రశేఖర్,కరుణాకర్ ,బాలు,నరేంద్రాచరి,నర్సిహులు సుధాకర్,రామచంద్రము తదితరులు పాల్గొన్నారు..
- 6 views