ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:21
Massive additions to TRS near MLA

బచ్చన్నపేట సెప్టెంబర్ 10 ప్రజా జ్యోతి: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకా లను చూసే పలు పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నా రని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్ర వారం మండలంలోని పడమటికేశ్వపూర్కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు చల్లా శ్రీనివాస్ రెడ్డి, చల్ల తిరు పతిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సంద వారికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఇంటింటికీ టీఆర్ఎస్ ప్రభు త్వ పథకాలు అందాయన్నారు.

గ్రామా నికి చెందిన శివకుమార్, రాకేశ్, గణేశ్, బాలయ్య, శ్రీకాంత్, బాదన కుమార్, రాజు, ఇస్తారి, సందీప్కు మార్, యాదగిరి, కనుకయ్య, నాగరాజు, స్వామి, రాములు, రవి, రమేశ్, నర్సింహులు, వెంకటేశ్ 30 మందికిపైగా టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇద్రి రమణారెడ్డి, జడ్పీ వై స్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మీ అంజయ్య, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు, నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.