ములుగు జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): ప్రపంచ శాంతి కోసం జాతి పిత మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి చూపిన అహింస మార్గంలో ప్రయణిద్ధామని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.ఆదివారం మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి తస్లీమా పూలమాలవేసి నివాళులర్పించారు.అలాగే లాల్ బహుదూర్ శాస్త్రి 118 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తస్లీమా పూలమాల వేసిన నివాళులర్పించారు,అనంతరం తస్లీమా మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో శాంతియుత మార్గంలో నడిపిన మహనీయుడు మహాత్మాగాంధీ అని వ్యాఖ్యానించారు. లాల్ బహుదూర్ శాస్త్రి దేశ ప్రధానిగా రెండుసార్లు బాధ్యతలు చేపట్టి జై జవాన్, జై కిసాన్ అనేనినాదంతో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి లాల్ బహుదూర్ శాస్త్రి అని తస్లీమా అయన సేవలను కొనియాడారు.
- 3 views