బూత్ స్థాయి నుంచే పార్టీ బలోపేతం కావాలి-- బచ్చన్నపేట బిజెపి మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:33
The party needs to be strengthened from the booth level-- Bachchannapet BJP mandal president Saddi Somireddy

బచ్చన్నపేట సెప్టెంబర్ 23 ప్రజా జ్యోతి: భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలని  బచ్చన్నపేట మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి అన్నారు.ఈ సందర్భంగాజనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్ర పురం గ్రామంలో మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగినది. నరేంద్ర మోడీ గారి పథకాలకు ఆకర్షితులై యువత ఉత్సాహంతో పార్టీలో చేరికలు అవడం జరుగుతుందని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు పైస కరుణాకర్, బూత్ ప్రధాన కార్యదర్శి ,పగిడి నాగరాజు ,మరియు బింగి నరేష్, పసుమర్తి కిషన్ ,నాచగోని కుమార్ ,మెండు మధు, ఆముదాల రాజిరెడ్డి ,ఉత్కం నాగేష్ ,పగిడి భవాని, తదితరులు పాల్గొన్నారు.