ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:39
Navratri celebrations begin grandly

కాజీపేట, సెప్టెంబర్26 (ప్రజాజ్యోతి)..//శ్రీ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం లో 24వ అమ్మవారి నవరాత్రులలో మొదటి రోజు సోమవారం ప్రారంభించారు. సోమవారం నిత్య పూజ హోమం సాయంకాలం అమ్మవారి అలంకరణ శ్రీ స్వర్ణ కవచలం కృత దుర్గాదేవి గా అలంకరించారు.ఈ కార్యక్రమంలో శివశక్తి యూత్ శ్రీదేవి శరన్న కమిటీ, శ్రీ బ్రహ్మిరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం కమిటీ, శ్రీదేవి నవరాత్రుల పూజల ఉపాసకులు అయినవోలు ప్రవీణ్ కుమార్ శర్మ, శ్రీనివాస్ శర్మ , కమిటీ సభ్యులు మిట్టపల్లి రవీందర్, కృష్ణమోహన్, నాగవెల్లి శ్రీధర్, భద్రకోట రంజిత్ కుమార్, కే అశోక్, హరి, గణేష్ సింగ్, ప్రశాంత్, భరత్, రాహుల్, ఆనంద్, విజయ్, రఘు, దేవాలయం కమిటీ సభ్యులు పాల్గోన్నారు.