నిడమనూరు, సెప్టెంబర్11(ప్రజాజ్యోతి): నిడమనూరు మండలం వెనిగండ్ల గ్రామంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కట్టెబోయిన గురవయ్య యాదవ్ మాతృమూర్తి కట్టెబోయిన బాలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఈవిషయంపై ఆదివారంవెనిగండ్ల గ్రామంలో కట్టెబోయిన గురవయ్య యాదవ్ నివాసంలో ఆమె చిత్రపటానికి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీమంకెన చిన్న కోటిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈకార్యక్రమంలోఆయన వెంట అనుముల ఎంపిపి ముఖ్య సలహాదారుడు పురుషోత్తం,నల్లగొండ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రావుల రాంబాబు యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ కుంటి గొర్ల పాపయ్య యాదవ్, మాజీ సర్పంచ్ రావుల శ్రీనివాస్ యాదవ్, కుటుంబ సభ్యులు ,తదితరులు ,పాల్గొన్నారు.