గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30 : ఇటీవలే వెలువడిన ఐఐటి ఫలితాలలో జేఈఈ ఆల్ ఇండియా 2956 ర్యాంకు పిడబ్ల్యుడి లో ఆల్ ఇండియా 3వ, ర్యాంకు సాధించిన బి అభినవ్ కుమార్ రెడ్డి కు ఐఐటీ ముంబై నందు అడ్మిషన్ పొందిన శుభ సందర్భంగా, శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభినవ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో చదువుకొని, అత్యధిక స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి, మీ తల్లిదండ్రులకు, మీ గురువులు, గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టని తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గట్టు ఎంపీపీ విజయ్, జెడ్పిటిసి రాజశేఖర్, ఎస్జిటి జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- 3 views