బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:32
 MLA Shankar Naik participated in the distribution of Bathukamma sarees

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహబూబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రం  ఇంటికన్నె గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొని బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.   గురువారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటన కోసం ప్రజా ప్రతినిధులు తెరాస కార్యకర్తలు ఇంటికన్నె గ్రామంలో పెద్ద ఎత్తున డప్పుల చప్పులతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘన స్వాగతం పలికారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఆడబిడ్డను తన ఇంటి ఆడబిడ్డ గౌరవిస్తూ బతుకమ్మకు కోటి చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఆసరా పెన్షన్ లను అందజేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ , జెడ్పిటిసి , సర్పంచులు, ఎంపిటిసిలు, మండల ముఖ్యనాయకులు , పార్టీ గ్రామ ముఖ్య నాయకులు , అధికారులు , మరియు తదితరులు పాల్గొన్నారు.