మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన-ఎమ్మెల్యే రాజయ్య

Submitted by bosusambashivaraju on Mon, 19/09/2022 - 13:10
MLA Rajaiah provided financial assistance to the deceased's family


స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 18 ( ప్రజాజ్యోతి ) :-  స్టేషన్ ఘనపూర్ మండలం , మీదికొండ  గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు జోగు రాజు  తండ్రి జోగు కొమురయ్య  మరణించినందున ఆదివారం వారి పార్థివ దేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య  సందర్శించారు. కొమురయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారికి ఆర్థిక సాయం అందించి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో  స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, మార్కెట్ డైరెక్టర్ రాజ్ కుమార్, అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు ,కుటుంబ సభ్యులు , బంధువులు , గ్రామస్తులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.