అల్లంపూర్,సెప్టెంబర్27:(ప్రజాజ్యోతి) : హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో ఉన్న విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని వారి నివాసంలో అల్లంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీయం. అబ్రహం, రాజోలి మండల నాయకులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని రాజోలి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందచేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కళాశాల మంజూరికి కృషి చేస్తానని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేతోపాటు సీనియర్ నాయకులు పెద్ద గంగిరెడ్డి, శ్రీరామ్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు నిషాక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, ఎంపీటీసీ షాషావలి, ముగేన్న, లక్ష్మి నారాయణ రెడ్డి, దస్తగిరి, సత్య, టీచర్ ఈశ్వరయ్య, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- 3 views