- రజక వృత్తిదారుల సంఘం డిమాండ్
పాలకుర్తి, సెప్టెంబర్ 10, ప్రజాజ్యోతి:- జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి మదర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఐలమ్మ 37 వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఐలమ్మ స్తూపానికి ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఐలమ్మ వారసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మదర్ మాట్లాడుతూ 2017 పాలకుర్తికి ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా బహిరంగ సభలో మహిళా డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీ ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వ చొరవ తీసుకొని ఇచ్చిన హామీలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. పాలకుర్తి మండలంలో ఈరవెన్ను, గూడూరు , బొమ్మెర వివిధ గ్రామాలలో ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐలమ్మ కుటుంబ సభ్యులు చిట్యాల యాకయ్య , అండాలు, మంజుల , రాణి, రజక సంఘంనాయకులు జ్యోతి యాదగిరి , మామిడాల సోమయ్య , చిట్యాల యాకయ్య, మధు, రవి , రాజు ప్రజా సంఘాల నాయకులు చిట్యాల సోమన్న , సింగారం రమేష్, మాచర్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు