అడ్డగూడూరు సెప్టెంబర్ 25(ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగుడూరు మండల కేంద్రానికి చెందిన నవ తెలంగాణ రిపోర్టర్ పరిగాల కనకయ్య తండ్రి పరిగల నర్సయ్య ఇటీవలె అనారోగ్యంతో మరణించారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి అనంతరం వారి కుటుంబనికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా టెలికామ్ అడ్వైజరీ కమిటీ మెంబర్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి వారితో పాటు ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్, మండల నాయకులు లింగాల నర్సిరెడ్డి, చిప్పలపల్లి పరశురాములు, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చేడే మహేందర్, యాదాద్రి భువనగిరి జిల్లా NSUI ఉపాధ్యక్షుడు చేడే అంబెడ్కర్, యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షులు సూరారం నవీన్ కుమార్, కొమ్ము జోహార్, తదితరులు పాల్గొన్నారు.*
- 8 views