మునుగోడు లో టీఆర్ఎస్ దే విజయం

Submitted by Sathish Kammampati on Fri, 23/09/2022 - 09:57
TRS's victory in Munugodu

సీఎం కేసీఆర్,మంత్రి జగదీశ్ రెడ్డి నాయత్వంలో భారీ విజయం

టీఆర్ఎస్ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్

చిట్యాల సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి).././ మునుగోడు ఉప ఎన్నకల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని టీఆర్ఎస్ సీనియర్ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్,మంత్రి జగదీశ్ రెడ్డి నాయత్వంలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారు.మునుగోడు లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ప్రజల్లో మద్దతు రోజు రోజు కి తగ్గిపోతుంది అన్నారు. వేల కోట్ల కాంట్రాక్టు పనులకొసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్లి ఉప ఎన్నికలకు కారణం అయ్యిండని, ఆరు నెలలకు ఒక సారి నియోజిక వర్గానికి వచ్చి వెళ్తడని ప్రజల్లో త్రీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.రాష్ట్ర మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి క్షేత్ర స్థాయిలో అభివృధి పర్యటనలతో ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ పై నమ్మకం రోజురోజు కి పెరుగుతుందన్నారు.ఆత్మీయ సమ్మేళన లతో పార్టీ కార్యకర్తల్లో ఐక్యతతో పాటు, విజయం పట్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు.సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన గిరిజన రిజ్వేషన్ల,గిరిజన బంధు తో మునుగోడు నియోజకవర్గం లోని గిరిజనుల మద్దతు టీఆర్ఎస్ వచ్చిందని ఇక బిజెపి పని అయిపోయిందన్నారు.