మధిర

స్కూళ్లకు 15 రోజులు సెలవులు

Submitted by Degala Veladri on Tue, 13/09/2022 - 12:00

స్కూళ్లకు 15 రోజులు సెలవులు

 

అక్టోబర్ 5న దసర

సర్క్యూలర్ జారీ చేసిన సర్కార్

బోనకల్, సెప్టెంబరు 13, ప్రజాజ్యోతి:

తెలంగాణ సర్కార్ సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా ప్రకటించింది. కాగా సెప్టెంబర్ 25, అక్టోబర్ 9వ తేదీన ఆదివారం అవడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయి. విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10వ తేదీ సోమవారం ప్రారంభం అవుతాయి. కాగా, అక్టోబర్ 5వ తేదీన దసరాగా ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.

భట్టి విక్రమార్కని కలిసిన మధిర మత్స్యశాఖ సహకార సంఘం నాయకులు

Submitted by Degala Veladri on Mon, 12/09/2022 - 20:52

భట్టి విక్రమార్కని కలిసిన మధిర మత్స్యశాఖ సహకార సంఘం నాయకులు  

 

బోనకల్, సెప్టెంబర్ 12 , ప్రజాజ్యోతి:

 

ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్యకారులకు అడ్డుగా ఉన్న 74 జీవోను సవరించాలని కోరుతూ, హైదరాబాదులో సోమవారం మధిర శాసన సభ్యులు,సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖమ్మం జిల్లా కోప్ మాజీ డైరెక్టర్ సుబ్బారావు, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు మరసకట్ల బాలరాజు,మధిర మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పులిపాటి సుబ్బారావు లు  కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ పిల్లి మొవీజ్, కలకోట డైరెక్టర్ యంగల రవి కుమార్,డైరెక్టర్ గద్దల స్వామి,పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.