అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి.

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 17:22
Pensions should be granted to all who are eligible.
  • దరఖాస్తులు పరిశీలించకుండానే కొంతమందికే పెన్షన్లు మంజూరు.
  • అర్హులందరికీ  పెన్షన్ ఇవ్వాలని త్వరలో ధర్నా చేపడతాం
  • డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ.

అచ్చంపేట సెప్టెంబర్ 15 ప్రజా జ్యోతి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొంతమందికే మంజూరు చేసి మిగతా వారికి ప్రభుత్వం మొండి చేయి చూపిందని డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం చారకొండ మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు పరులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి అన్ని మండల కేంద్రాలలో ఎంపీడీవో కార్యాలయంల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు మొదటగా 22న చారకొండ మండలంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి పెన్షన్లు మంజూరు కానీ వృద్దులు ఒంటరి మహిళలు వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా ఇటీవల జారీ చేసిన పెన్షన్ లిస్టులో టిఆర్ఎస్ నాయకులు కావాలని కాంగ్రెస్ ఇతర పార్టీలకు చెందిన అర్హులైన వారి. పెన్షన్లను. తొలగిస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చారకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు బలరాం గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి అంజయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న వంశీకృష్ణ.