పెరిగిపోతున్న పేకాట రాయుళ్లు

Submitted by bathula ravikumar on Thu, 13/10/2022 - 11:18
పెరిగిపోతున్న పేకాట రాయుళ్లు

పెరిగిపోతున్న పేకాట రాయుళ్లు

సుజాతనగర్ అక్టోబర్ 13 ప్రజాజ్యోతి:

సుజాతనగర్ మండలంలో పేకాట రాయుళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న సుజాతనగర్ మండలంలో పేకాట రాయుల హవా జోరుగా కొనసాగుతుంది ప్రతిరోజు రోజుకు ఒక గ్రామం చొప్పున వారు అడ్డాలు మారుస్తూ ఎవరికి దొరకకుండా జాగ్రత్త పడుతూ వారి ఆటలు మూడు ముక్కలు ఆరు పేకలు అన్నట్లు వారి ఆటలు దర్జాగా ఆడుతున్నారు. ప్రతి రోజు సీతంపేట మంగపేట లక్ష్మిదేవిపల్లి పరిసర ప్రాంతాలలో లక్షల రూపాయలలో పేకాట స్థావరాలు జూదం మట్కా ఆడుతూనారు సుజాతనగర్ కొత్తగూడెం జూలూరుపాడు చండ్రుగొండ మండలంలోని సుమారు 30 మంది వ్యక్తులు ఫోన్లు ద్వారా ఒకచోట చేరి వారి ఆటలు కొనసాగిస్తున్నారు ప్రతిరోజు లక్షల రూపాయల ఆట ఆడుతూ డబ్బులు పోగొట్టుకొని వారి కుటుంబాలను అప్పుల్లోకి నెట్టేస్తున్నారు కొంతమంది పేకాట కోసం భార్య తాళిబొట్టు పట్టీలు విలువైన బంగారం వస్తువులను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి దర్జాగా పేకాట ఆడుతూ కుటుంబాలలో కలహాలు తెచ్చుకుంటున్నారు పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులకు తెలియకుండా వ్యవహారమంతా నడిపిస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు పేకాట రాయుళ్లపై నిఘా ఉంచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుజాతనగర్ మండల ప్రజలు కోరుతున్నారు