విదేశీ పర్యటనతోదేశ ఖజానాకు తూట్లు!!

Submitted by kareem Md on Sat, 17/09/2022 - 15:35
With a foreign trip..Jewels to the country's exchequer!!

ఫోటో రైటప్: చెప్పులు కుడుతూ నిరసన వ్యక్తం చేస్తున్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్
-జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్

హాలియా,సెప్టెంబర్17(ప్రజా జ్యోతి): విదేశీ పర్యటనల పేరుతో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ఖజానాకు తూట్లు పొడుస్తున్నాడని నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్ పేర్కొన్నారు.శనివారం హాలియా మున్సిపాలిటీ కేంద్రంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విన్నుతంగా నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రాక ముందు రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి విదేశీ పర్యటనలతో పేరుతో నిరుద్యోగ యువతను విస్మరిచి ఖజానాకు తూట్లు పొడిచి దేశాన్ని దివాలా తీయిస్తూండన్నారు.తెలంగాణ విమోచన దినం పేరుతో ప్రాంతాల మధ్య,,మతాల మధ్య చిచ్చు పెట్టి చూస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలుచేపట్టకపోయినట్టయితే  కేంద్ర రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసనలు చేపడతామని తెలిపారు.జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిరుద్యోగ దినోత్సవంగా పాటిస్తూ హాలియా ప్రధాన కూడలిలో పాదరక్షలు కుడుతూ నిరసన వ్యక్తం చేసినారు.ఈ కార్యక్రమంలో అనుముల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి,ఎడవల్లి నరేందర్ రెడ్డి,జూపల్లి శ్రీనివాస్,ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు మజారుద్దీన్,పాంపాటి శ్రీనివాస్,వర్కాల శ్రీనివాస్ రెడ్డి,నకిరేకంటి సైదులు, బొంగరాల ఏసురాజు, మాజీద్,సత్యనారాయణ,   కూరాకుల శ్రీనివాస్,మేకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.