చిట్యాల లో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి

Submitted by Sathish Kammampati on Wed, 28/09/2022 - 10:09
Acharya Konda Laxman Bapuji Jayanti in Chityala

చిట్యాల సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి).///... నల్లగొండ జిల్లా:ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మూడు తరాల ఉద్యమయోధుడు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం చిట్యాల ఆధ్వర్యంలో మంగళవారం  పట్టణంలోని సాయి బృందావన్ కాలనీలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం బాధ్యులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేశారు.ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ పద్మశాలీయులు సమాజంలో మంచి గుర్తింపు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిలుకూరి ప్రసాద్, జెల్ల మనోహర్, గంజి వెంకటేశం, పున్న పాండు, సూరేపల్లి రాములు, మిరియాల, వెంకటేశ్వర్లు తడక మురళి, గండూరి శ్రీనివాస్, రచ్చ దామోదర్, గంజి అంజయ్య, ఇనుగంటి కృష్ణయ్య, మిర్యాల వెంకటేశం, సంగిశెట్టి మనోహర్, కోట రాంబాబు, పిల్లలమర్రి వెంకటేశం, చెరుపల్లి గోవర్ధన్, సూరేపల్లి సత్యనారాయణ,మిరియాల గోవర్ధన్, మిరియాల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.