ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 14:28
Grand Konda Laxman Bapuji's 10th death anniversary


నాంపల్లి, సెప్టెంబర్ 22( ప్రజా జ్యోతి)../.// మండల కేంద్రంలోని అంబేద్కర్ స్టాచ్ ముందు బుధవారం నాడు  కొండా లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి సందర్భంగా తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాధన సమితి ఆధ్వర్యంలో వర్ధంతి ఉత్సవం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాంపల్లి తహాశీల్దార్ లాల్ బహుదూర్ శాస్త్రి,ఎంపీడీవో ఎల్ రాజు పాల్గొని, బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం  వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం, స్వాతంత్ర పోరాటం ఉద్యమంలో మలిదశ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా ఢిల్లీలో మౌన దీక్షకు దిగిన మహోన్నత వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజి అని అదేవిధంగా పదవులు ముఖ్యం కాదని తెలంగాణ ఉద్యమంలో చివరి శ్వాస వరకు తను నిస్వార్ధంగా సేవలు అందించిన మహోన్నత వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబుజి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి గారు, మాజీ ఉప సర్పంచ్ సంగపు గణేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ నక్క చంద్రశేఖర్, అడ్వకేట్ కోరె కిషన్,వీఆర్ఏల సంఘం మండల కార్యదర్శి కోరే యాదగిరి,రెడ్డిమల్ల రాములు, బుషిపాక నరసింహ, కర్నాటి ప్రవీణ్ గౌడ్, పెరుమళ్ల ప్రకాష్, అమరవీరుల ఆశయాల సాధన సమితి  లీగల్ అడ్వైజర్ కోరే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.