అనిరెడ్డిగూడెం గ్రామంలో గణేశుని శోభాయాత్ర ముఖ్య అతిథిగా పాల్గొన్న ముదిరెడ్డి రాజేష్

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 12:47
Ganesha Shobhayatra in Anireddygudem village   Mudireddy Rajesh was the chief guest

పెన్పహాడ్ సెప్టెంబర్13 (ప్రజా జ్యోతి): రాజేష్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుడు 13 రోజుల పూజల అనంతరం పెన్పహాడ్ మండల పరిధిలోని అనిరెడ్డి గూడెం గ్రామంలో శోభాయాత్ర నిర్వహించి అనంతరం గణేష్ నిమజ్జనం కార్యక్రమం చేశారు .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముదిరెడ్డి రాజేష్  మాట్లాడుతూ అనిరెడ్డిగూడెం గ్రామ యువకులను అభినందించారు . వారికి సహకరించిన కాలనీ ప్రజలకు,యువకులకు,మాచారం గ్రామ ప్రజలకు,యువకులకు మరియు గుడిబండ ప్రజలకు,యువజన సోదరులకు,ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అనంతరం ప్రజలనుదేశించి మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏంటో తెలియని మన ప్రాంతానికి అభివృద్ధి ఫలాలను రుచి చూపిన నేత విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు అటువంటి నాయకుడు మనకు ఉండడం అదృష్టమని,గతంలో  పరిపాలించిన ఏ నాయకుడు కూడా ప్రజలకు అందుబాటులో లేరని, స్థానిక శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రి   నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకుంటూ వాటిని తీరుస్తూ, ముందుకు వెళ్తున్న తీరు తనను ఎంతగానో ఉత్తేజపరిచిందని,అటువoటి నాయకుడికి మనమందరం పార్టీలకతీతంగా రుణపడి ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెరాస సీరియస్ నాయకులు ముదిరెడ్డి రంగారెడ్డి, మాచారం ఎంపీటీసీ సభ్యులు నాగు నాయక్ ,ముదిరెడ్డి వెంకట్ రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ నాగయ్య నాయక్,మాజీ ఎంపీటీసీ సభ్యులు పల్లే సైదులు , జులంకటి దుర్గారెడ్డి, దేవిరెడ్డి వెంకట్ రెడ్డి,గడ్డం సజీవ రెడ్డి,చల్లమల్ల రామ్ రెడ్డి ,TRSV మండల అధ్యక్షులు బొల్లక లింగయ్య యాదవ్,తెరాస యువజన నాయకులు గణేష్ యాదవ్, యువకులు మరియు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.