ములుగు జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): జాతీపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ములుగు డిఆర్ఓ రమాదేవి అన్నారు.ఆదివారం మాహత్మాగాంధీ జయంతి సందర్భంగా ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రమాదేవి మాట్లాడుతూ సత్యాగ్రహం అయుధంగా అహింస,శాంతి మార్గంలో దేశానికి స్వాతంత్య్ర సముపార్జన చేసిన మహానీయుడు మహాత్మగాంధీ అని కొనియాడారు.గాంధీ చూపిన మార్గంలో పయణించి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని అన్నారు.కార్యక్రమంలో కలెక్టరేట్,ఆర్డీఓకార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- 2 views