జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.

Submitted by Sathish Kammampati on Mon, 19/09/2022 - 11:58
Food donation program under the auspices of Janayetri Foundation.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 18(ప్రజా జ్యోతి),, గుర్రంపోడు మండలంలోని  నడికూడ గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు జనయేత్రి ఫౌండేషన్ కార్యవర్గ సభ్యుడు దాసోజు కృష్ణమాచారి మనవడు తేజేశ్వర్ జన్మదినం సందర్భంగా ఆదివారం నల్లగొండ లోని లతీఫ్ సాహెబ్ దర్గా వద్ద జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మంది యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కంబాల శివ లీల మాట్లాడుతూ.. అన్ని దానాలలో కంటే అన్నదానం చాలా గొప్పదని అన్నారు.అన్నదాన నిర్వాహకులు దాసోజు కృష్ణమాచారి మాట్లాడుతూ.. తన మనవడి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనయేత్రి ఫౌండేషన్ సలహాదారులు జాజాల కృష్ణ, కార్యవర్గ సభ్యులు జోగు మల్లికార్జున,శ్రీనివాసాచారి, కొండయ్య చారి,సత్యనారాయణ చారి,యాదగిరి,పరాంకుశం, రంగనాయకమ్మ తదితరులు పాల్గొన్నారు.