మాలమహానాడు మండల కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 12:52
The election of Malamahanadu mandal committee was unanimous

పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి):  మండల మాల మహానాడు మండల నూతన కమిటీని మండల కేంద్రంలో మంగళవారం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్ల మల్ల హసేన్  సూచనల మేరకు సూర్యాపేట జిల్లా మాల మహానాడు అధ్యక్షులు బొల్లిఎద్దు వినయ్  అధ్యక్షతన.పెన్ పహాడ్ మండల మాల మహానాడు మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నూతనమండల అధ్యక్షులుగా మద్దెల సతీష్ . ఉపాధ్యక్షులుగా రాయిళ్ళ శ్రీనివాస్. బోలేదు మహేష్, మండల ప్రధాన కార్యదర్శిగా రాయి అనిల్. కోశాధికారిగా రాయి ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా యూత్ అధ్యక్షులు కూరపాటి విజయ్. వినోద్. వెంకటేశ్వర్లు. సత్తయ్య. రాములు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భమున నూతనంగా ఎన్నికైన మండల మాల మహానాడు అధ్యక్షులు మద్దెల సతీష్ మాట్లాడుతూ మాల మహానాడు సంగం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షణీయమని ఆయన అన్నారు మాల సంఘం పెద్దల సహకారంతో సంగం బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు.