జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎడ్ల నరేష్ రెడ్డి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:25
Edla Naresh Reddy as District Youth Congress President

మహబూబాబాద్ బ్యూరో అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): మహబూబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గూడూరు మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన ఎడ్ల నరేష్ రెడ్డి ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంకర అయ్యప్ప రెడ్డి నియమించినట్లు తెలిపారు. నరేష్ రెడ్డి గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నందుకు వారికి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినట్లు తెలిపారు.  ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని యువతను సీనియర్ నాయకులు అందరిని కలుపుకొని వెళ్తానని తెలిపారు. నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డికి రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి కి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి కి,బలరాం నాయక్ కి,మురళి నాయక్ కి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గందసిరి శ్రావణ్ కి, జిల్లా నాయకులకు, మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.