మావోయిస్టులకు సహకరించొద్దు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి

Submitted by srinivas on Wed, 28/09/2022 - 13:03
Do not cooperate with Maoists  SI Srikanth Reddy

రేగొండ, సెప్టెంబర్ 27 ప్రజాజ్యోతి :  మావోయిస్టులకు సహకరిస్తే చర్య లు తప్పవని ఎస్ఐ ననిగంటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మావోయిస్టుల ఫొటోలతో కూడిన వాల్‌పోస్టర్లు ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అపరిచితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మావోయిస్టు భావజాలం వైపు యువతను ప్రేరేపించాలని చూసిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గుడుంబా అమ్మిన తయారుచేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనియ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని అన్నారు. మండలంలోని 14 గ్రామాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు చాలా పనిచేస్తున్నాయని తెలిపారు. మిగతా గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తున్నామని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామాల్లోని ప్రజలంతా సహకరిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.