నాంపల్లి, సెప్టెంబర్27(ప్రజాజ్యోతి )..//..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నాంపల్లి మండలంలో ఎంపిపి ఏడుదోడ్ల శ్వేత రవిందర్ రెడ్డి పలు గ్రామాల్లో చీరలు పంపిణీ చేశారు.నాంపల్లి మండలంలోని స్వాములవారి లింగోటం,టి పి గౌరారం,చిట్టెంపాడు,నెమిళ్లగూడెం,దామేర, రాందాస్ తండా గ్రామ పంచాయతీలలో ఎంపిపి చేతులమీదుగా చీరల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎం పి టి సి లు బెక్కం రమేష్, దాసరి సాలమ్మ, సప్పిడి రాధిక శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ లు ఎ.పాండు,కోమ్ము యాదమ్మ,దామేర యాదగిరి,మెగవత్ లీలా ఎం పి డి వో రాజు,పంచాయతీ కార్యదర్శులు ఆవుల వెంకటయ్య,గడ్డి పుల్లయ్య,జంగయ్య,అన్నేపాక ఈదయ్య,దుబ్బ జనార్ధన్,కృష్ణయ్య,వట్టికోటి నరేష్,మెండె కిరణ్,ఎరెడ్ల మోహన్ రెడ్డి,ఇస్మాయిల్,బోట్టు జగన్, హన్మంతు, బాషా, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- 2 views