భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) మండలంలోని గౌస్ కొండ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులు కాసుల వీరేష్ గౌడ్ కు 20,000 రూపాయల చెక్కును స్థానిక సర్పంచ్ పక్కిర్ లావణ్య దేవేందర్ రెడ్డి టీఆరెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వాకిటి బాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారం మరువలేనిది అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గుర్రం బాల్ రెడ్డి, నోములు శ్రీనివాస్ రెడ్డి, కానుగు పోచయ్య, సుమన్ మల్లేష్, గోపగోని శ్రీహరి, కందుకూరి కిషన్ తదితరులు పాల్గొన్నారు.