దివ్య శిష్య బృందం నృత్య ప్రదర్శన

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 13:00
Dance performance by Divya Sishya troupe

హనుమకొండ, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి)../  తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం హనుమకొండ లోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్య శిష్య బృందం నృత్య ప్రదర్శనను ఇచ్చి ప్రశంసలను అందుకున్నారు.  ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జాయింట్ కలెక్టర్ లు హాజరయ్యారు. నృత్య ప్రదర్శన ఇచ్చిన చిన్నారులను అభినందించి, ప్రశంసా పత్రాలతో ప్రోత్సహించారు. గురువులను సన్మానించి, అభినందనలు తెలియజేశారు.