పెన్ పహాడ్ మండలం సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి): మండల పరిధిలోని దుబ్బ తండా గ్రామ ఉప-సర్పంచ్ భూక్యా భాస్కర్ తండ్రి భూక్యా చీన్యా నాయక్ మృతి చెందడంతో వారి పార్థివ దేహానికి, కాంగ్రెస్ పార్టీ పెన్పహాడ్ మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు పూలమాల వేసి నివాళుర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్యా నాయక్ పార్టీ కోసం తన గ్రామంలో పార్టీ అభివృద్ధి కోసం పని చేశారని అతని అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. పరామర్శించిన వారిలో మృతుని కుటుంబ సభ్యులు గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
- 5 views