ఆదివాసి గిరిజన సమ్మేళనం పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 13:09
A collector who unveiled the Adivasi Tribal Association poster

జనగామ, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి :-  జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 17న ముఖ్యమంత్రి చేతుల మీదుగా హైదరాబాద్ లో  ప్రారంభించనున్న ఆదివాసి భవన్, బంజారా భవన్ కు సంబంధించిన వాల్ పోస్టర్, స్టిక్కర్స్ ను గురువారం జనగామ జిల్లా కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య తన చాంబర్ లో డి.సి.పి. సీతారాం, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ జిల్లా అధికారులతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆదివాసి గిరిజన సమ్మేళనానికి జిల్లా నుండి పెద్ద ఎత్తున ఆదివాసి గిరిజనులు తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లే  వారు తమ తమ గ్రామపంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఇస్మాయిల్ ఈ డిస్టిక్ మేనేజర్ దుర్గారావు జిల్లా సమాచార పౌర  సంబంధాల శాఖ అధికారి శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్ ఎస్ శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.