టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి : పత్తి వెంకటాద్రి
కొడకండ్ల (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 12 : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 13న టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టి ఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పత్తి వెంకటాద్రి పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు షెడ్యూల్ విడుదల చేయాలని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, 317 జీవో ద్వారా అన్యాయం జరిగిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని, స్పౌజ్ సమస్యలు పరిష్కరించాలని, విద్యా వాలంటీర్లు పారిశుద్ధ్య కార్మికులను పాఠశాలల్లో నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల నాయకులు వి. సోమయ్య, మొయిజుద్దీన్, రాజు, రాములు, సీతారాం,శ్రీనివాస్, వీరభద్రం,రామారావు, తదితరులు పాల్గొన్నారు.