హుజూర్ నగర్ సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి): ముక్త్యాల బ్రాంచ్ కాల్వ నీటిలో వరద ప్రవాహానికి కొట్టుకొని పోయిన యువకుడి మృతదేహం లభ్యమైనట్లు హుజూర్ నగర్ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం 27 వ తేది మధ్యాహ్నం సమయంలో చింతలపాలెం మండలం తమ్మారం గ్రామానికి చెందిన తిమ్మరెడ్డి ప్రతాప్ రెడ్డి వయసు 22 సం.రాలు, తండ్రి సత్యనారాయణ రెడ్డి అను అతను తన గ్రామానికి చెందిన కలగట్ల రాజశేఖర్ రెడ్డితో కలిసి మోటార్ సైకిల్ పై హుజూర్ నగర్ కు వచ్చి పని చూసుకొని తిరిగి ఇంటికి వెళ్తూ సాయంత్రం 4 గంటల సమయంలో ఎంబి కెనాల్ కాల్వలో స్నానం చేద్దాము అని దిగగా కాల్వ ఉదృతంగా వస్తుండడంతో కాల్వలో కొట్టుకొని బుధవారం ఉదయం 07.00 లకు వేపలసింగారం గ్రామ శివారులోని కాల్వలో చనిపోయి శవమై తేలాడు. మృతుని మేనమామ మలిరెడ్డి వెంకట్ రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
- 3 views