ప్రజా సంగ్రామ ముగింపు యాత్రకు తరలిన బిజెపి శ్రేణులు

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 15:39
BJP ranks moved to the end of public struggle

కాజీపేట, సెప్టెంబర్22 (ప్రజాజ్యోతి) .../../ కాజీపేట లోని 62వ డివిజన్ సోమిడి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు బహిరంగ సభకు కాజీపేట పట్టణ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ యాత్రను భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర నర్సింగ్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సభకు భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా అధికార ప్రతినిధి చాంద్ పాషా, డివిజన్ అధ్యక్షులు ఉపాధ్యాయ భగవాన్, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు కోవెల జీవన్ ప్రకాష్, జిల్లా కన్వీనర్ వికలాంగుల కన్వీనర్ హరి గౌడ్, బిజెపి నాయకులు శ్రీనివాస్,  చేరాలు, సమ్మయ్య గౌడ్, కొమరయ్య, పాల్గొన్నారు.