లింగాపూర్ సెప్టెంబర్ 24( ప్రజా జ్యోతి )..//.. మండల కేంద్రంలోని గోల్డెన్ లీఫ్ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మను పేర్చి ఒక్కొక్క పువ్వు వేసి బతుకమ్మను చూసి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రాజశేఖర్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలని పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జాదవ్ ప్రశాంత్. సుభాష్. విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
- 2 views