జాతీయ పంచాయతీ అవార్డ్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 15:33
Apply for National Panchayat Awards

పెన్పహాడ్ సెప్టెంబర్ 09 (ప్రజా జ్యోతి):    నేషనల్ పంచాయతీ అవార్డ్స్ గురించి ఒకరోజు ట్రైనింగ్ సెషన్ మండల పరిషత్ ఆఫీసులో మండల అధికారులతో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు జాతీయ పంచాయతీ అవార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని దానికి సంబంధించిన సమగ్ర అభివృద్ధి నివేదికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా వివిధ శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన సమాచారాన్ని  కార్యదర్శులకు అందచేయునట్లు తెలిపారు ఈ సమావేశంలో ఎంపీడీవో వెంకటాచారి, ఎమ్మార్వో శేషగిరిరావు, ఎంపిఓ నరేష్,అగ్రికల్చర్ ఆఫీసర్ కృష్ణ సందీప్, ఏఇలు గోపి, శ్రీనివాస్, ఏపీవో రవి, ఏపిఎం అజయ్ ,ఈసీ ఏక సామి, ఐసిడిఎస్ అధికారులు, మరియు తదితరులు పాల్గొన్నారు.