నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముందు అఖిలపక్ష మహా ధర్నా

Submitted by Ashok Kumar on Sat, 03/09/2022 - 11:11
All-party Maha Dharna in front of Nagar Kurnool Collectorate

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 2.(ప్రజా జ్యోతి ), ఉయ్యాలవాడలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణంలో భూములు కోల్పోయిన దళిత రైతులకు పరిహారం చెల్లించకుండా అక్రమంగా దొంగ సంతకాలు చేయించుకొని అక్రమంగా భూములు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క ఉయ్యాలవాడ దళిత రైతులకు తగు పరిహారం చెల్లించాలని వారికి అండగా ఈరోజు నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముందు అఖిలపక్ష మాహా ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ యొక్క అఖిలపక్ష మహాధర్నాలో భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ దిలీపాచారి గారు మాట్లాడుతూ ఈ యొక్క దళితుల భూములను అక్రమంగా తీసుకున్న అరాచక TRS ప్రభుత్వం,MLA నల్లమట్టి మర్రి జనార్దన్ రెడ్డి ఇప్పటికైనా నీ యొక్క అక్రమ పాలన,అక్రమ సంపాదనను మానుకొని దళితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.

అదేవిదంగా ఈ యొక్క పాపం,పుణ్యం తెలియని నిరక్షరాస్యులైన దళిత రైతుల వద్ద దొంగ సంతకాలు చేయించుకొన రెవెన్యూ అధికారులు,అదేవిదంగా MLA, అతని అనుచరులు దళితుల భూనులను లక్కోవడం జరిగింది.వీరందరిని కచ్చితంగా జాతీయ SC కమిషన్ కి పిలిపిస్తామని అక్కడికి వెళ్లి సమాధానం చెప్పే వరకు వదిలే ప్రసక్తి లేదని తెలియజేశారు.ఈ యొక్క దళిత రైతులకు న్యాయం జరిగే  వరకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుగా ఉంటామని తెలియజేశారు.