సెప్టెంబర్ 18 (ప్రజా జ్యోతి)మద్దిరాల మండలం../ వారంరోజుల్లోగా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ల జీవో జారీ చేసి, అమలు ప్రారంభిస్తామని త్వరలో గిరిజన బంధు ఇస్తామని ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రకటించినందుకు , హర్షం వ్యక్తం చేస్తూ, ఈ రోజు మద్దిరాల మండల గిరిజన ప్రజాప్రతినిధులు, యువకులు మండల కేంద్రం లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ శ్రీ. ఎస్ఏ రజాక్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు లావుడియా వెంకన్న నాయక్, వీరన్న నాయక్. జలెందర్ నాయక్, జిలకర చంద్రమౌళి, వడ్డాణం మధుసూదన్, కొలగాని వెంకన్న, మల్లు ఉపేందర్ రెడ్డి, రాంపాక సతీశ్,బొబ్బిలి ఉప్పలయ్య, లంజపెళ్లి వెంకన్న,బాణోత్ లింగయ్య నాయక్, రాజు నాయక్, వీరు నాయక్, తదితరులు పాల్గొన్నారు*
- 1 view