గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 30 : దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి, శుక్రవారం రోజున జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణకు సుమారు రెండు లక్షల 16 రూపాయల కొత్త కరెన్సీ నోట్లను ఉపయోగించినట్లు అధ్యక్షులు ఇల్లూరు నాగరాజు తెలిపారు. ఉదయం అమ్మవారి అభిషేకం, అలంకరణ, మంగళహారతి, తీర్థ ప్రసాదముల వితరణ, సాయంత్రం కుంకుమార్చనలు, సాంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాదం శ్రీనివాసులు, మనసాని నాగరాజు, నరహరి వెంకటేష్, నరహరి ప్రవీణ్ కుమార్, బాదం రాజు, ఇల్లూరు పద్మజ తదితరులు పాల్గొన్నారు.
- 1 view