కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం దేశద్రోహులను తరిమికొడదాం

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 11:47
 Let's save the Congress party like Kannathalli and drive out the traitors

మునుగోడు గడ్డమీద కాంగ్రెస్ కాయమన్న పాల్వాయి స్రవంతి 

మునుగోడు అక్టోబర్ 02(ప్రజా జ్యోతి):  మునుగోడు మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని తదనంతరం కొరటికల్ గ్రామానికి చేరుకొని వాడవాడల ప్రచారం చేశారు ప్రచారంలో భాగంగా కార్యకర్తలను పలకరిస్తూ  మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని అన్నారు మతతత్వ పార్టీ బిజెపికి ఓట్లు వేస్తే మన ఆత్మ గౌరవాన్ని మనము చంపుకున్నట్టే అని చెప్పారు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన దండు పిచ్చయ్య కుమారుడు వయస్సు 18సం లు  మణికంఠ మరణించారు వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 10000అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా గెలిపించిన మునుగోడు ప్రజలను మోసం చేస్తూ తను చేసుకున్న పనులబిల్లులు22 వేల కోట్ల రూపాయలు కాపాడుకునేందుకు బిజెపి పార్టీలో చేరారని తెలిపారు ఇప్పటికైనా మునుగోడు ప్రజలు గ్రహించి టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీ ల అభ్యర్థులను ఓడించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇండ్ల స్థలాలు ఇండ్లు మరియు ఎన్నో అభివృద్ధి పథకాలను తెచ్చిపెట్టిన కాంగ్రెస్ను ఓడించాలని చూస్తున్న పార్టీలను పాతర వేయాలని తను కోరారు .