కాజీపేట టౌన్, సెప్టెంబర్28 (ప్రజాజ్యోతి).//.. నగరంలో ని చెన్నై షాపింగ్ మాల్ సిబ్బంది కి బుధవారం కాజిపేట్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కాజిపేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే. రామకృష్ణ , ఎస్సైరాజేష్ , ట్రాఫిక్ సిబ్బంది, ఆధ్వర్యంలో ట్రాఫిక్ మీద నిర్వహించిన ఈ అవగాహనా సదస్సు లో హెల్మెంట్, సెల్ ఫోన్ డ్రైవ్, ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్, పెండింగ్ చల్లాన్స్, పై కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ డ్రైవ్ కాజిపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు వివిధ ప్రాంతాలలో నిర్వహించబడునని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడప వలెనని లేనిచో చట్టరీత్యా చర్య తీసుకోవనబడునని సిఐ రామకృష్ణ తెలిపారు.
- 8 views