కాజీపేట, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి)././... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ చీరల పంపిణీ చేపట్టినట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 46, 64 డివిజన్లకు చెందిన మహిళలకు మంగళవారం మడికొండ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే అరూరి రమేష్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా జరుపుకోవడం మన అందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు గొప్పగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగను మహిళలు ఆత్మగౌరవంతో జరుపుకునేలా వారికి ఉచితంగా చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
- 15 views