వచ్చే ఎలక్షన్లో బీజేపీ అధికారం
మాజీ కేంద్ర మంత్రి బాబు మోహన్
గూడూరు సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి): మాజీ కేంద్రమంత్రి బిజెపి నాయకులు బాబు మోహన్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ప్రజా గోస బిజెపి భరోసా యాత్ర సందర్భంగా మాజీ కేంద్రమంత్రి బిజెపి నాయకులు బాబు మోహన్ పాల్గొనడం జరిగింది. మండలం చిన్న ఎల్లాపురం గ్రామంలో హనుమాన్ దేవాలయంలో గురువారం పూజలు చేసి బైక్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ బాబు మోహన్ ఆధ్వర్యంలో పార్టీలోకి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్నది రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వమే అని మహబూబాబాద్ జిల్లాలో కాషాయ జెండా ఎగురుతుంది అని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన జరుగుతుందని దొరలను ఇంటికి పంపి రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనను చూసి బిజెపి పార్టీలోకి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుతున్నారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు అరిగోస పడుతున్నారని, ప్రజల కష్టసుఖాలు తెలుసకుంటూ వారికి భరోసా ఇచ్చేందుకే ప్రజాగోస – బీజేపీ భరోసా యాత్ర చేపడుతున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, కేవలం మాయమాటలు చెబుతూ తెలంగాణను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.