కాజీపేట, అక్టోబర్02 (ప్రజాజ్యోతి)./...ఆదివారం హాన్మకొండ జిల్లా, కాజీపేట పట్టణం, 62వ డివిజన్ రెహమత్ నగర్, విష్ణుపురిలో శ్రీదుర్గా మహిళా కమిటీ, పంచముఖ హనుమాన్ సేవాసమితి యూత్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా మాజీ డీసిబి చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ లు పాల్గొని అమ్మవారి మండపాలను దర్శించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతపురం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసారు. ఈ కార్యక్రమంలో గుఱ్ఱపుకోటేశ్వర్, బోయినికుమార్ యాదవ్, మహేష్, బాలన్న, మహేందర్ రెడ్డి, నర్సింగ్, కొండ శివ, రాజు, టింకు, సాయి, క్రాంతి, ప్రతిక్, యూత్ సభ్యులు, భక్తులు, స్థానికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- 3 views