వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 28( ప్రజా జ్యోతి).//..ములుగు జిల్లా, వెంకటాపురం మండలం లో వ్యవసాయ కూలీలకు కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమ్మె ఐదురోజుల నుంచి చేయడం జరిగిందని, బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా ఎన్టీఆర్ సెంటర్ వరకు వెళ్లి అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా ను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బీరెడ్డిసాంభశివ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు కనీస వేతనం రోజుకు 300 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా వద్దకు ములుగు జిల్లా లేబర్అధికారి వినోద వచ్చి మీయొక్క సమస్య న్యాయమైనదని, సమస్యను రేపటి వరకు పరిష్కారం చుపిస్తామని నాయకులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు గ్యానంవాసు,కట్లనర్సింహాచారి, కుమ్మరిశ్రీను తదితరులు పాల్గొన్నారు.
- 7 views