చిట్యాల సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి) .//..నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలోచిట్యాల పట్టణ ప్రజలు 3-10-2022 సద్దుల బతుకమ్మ,5-10-2022 రోజున విజయదశమి జరుపుకోవాలని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలియజేసారు.మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ దసరా పండుగ ను సంతోషంగా శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చికిలం మెట్ల అశోక్ పాల్గొన్నారు.అనంతరం మాట్లాడుతూ చిట్యాల పురపాలిక లో దసరా పండుగకు మంచినీళ్ళ ఇబ్బంది లేకుండా వీధిలైట్ల సమస్య లేకుండా చూడాలని ఈ సందర్భంగా కోరారు.
- 2 views