హలియా,సెప్టెంబర్ 25(ప్రజా జ్యోతి): తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు కానుకగా ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తుందని అనుముల మండల ఎంపీపీ సుమతి పురుషోత్తం అన్నారు. ఆదివారం అనుముల మండల పరిధిలోని పేరూరు,మదారి గూడెం గ్రామాలలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసినారు.అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. బతుకమ్మ పండుగ పురస్కరించుకొని చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం జరిగిందన్నారు.ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి గోళ్ళ లక్ష్మి,మండల కో ఆప్షన్ మెంబర్ షేక్ మున్న,సర్పంచ్ కుందారపు సైదులు,సాధన నర్సింహారెడ్డి,షేక్ అస్గర్,షేక్ మక్బూల్,టిఆర్ఎస్ నాయకులు బెడుదూరి వెంకటరెడ్డి,పసుల ప్రసాద్ యాదవ్,కొండూరు శోభన్ బాబు,ఎడవల్లి రాములు,తరి మొగులయ్య,ఎడవల్లి శంకర్ ప్రమీల,రియాజ్,తదితరులు పాల్గొన్నారు.
- 2 views