తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత

Submitted by Upender Bukka on Tue, 27/09/2022 - 15:12
Submission of petition to Tehsildar

ప్రజా జ్యోతి తిరుమలగిరి టౌన్ 26సెప్టెంబర్.//..   డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మండల అధ్యక్షుడు షేక్ చాంద్ పాషా సోమవారం తిరుమలగిరి మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా సీనియారిటీ ,పేదరికం ప్రాతిపదికన ఇళ్ల స్థలాల కేటాయించి ఇండ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసి వెంటనే అమలు చేయాలని కోరారు. జర్నలిస్టులు ఎలాంటి జీతభత్యాలు లేకుండా సమాజ హితమే లక్ష్యంగా కష్టనష్టాలను ఓర్చుకునే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమస్యల సాధనకు వారధిగా పనిచేస్తూ నిస్వార్ధంగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్లను కేటాయించాలని కోరారు.