గద్వాల ప్రతినిధి (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 30 : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పద్మశాలీల శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో శుక్రవారం అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణకు సుమారు ఒక లక్ష 116 రూపాయల కొత్త కరెన్సీ నోట్లను ఉపయోగించినట్లు అర్చకులు రామాచారి జోషి తెలిపారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, అలంకరణ, మంగళహారతి, తీర్థ ప్రసాదముల వితరణ, సాయంత్రం కుంకుమార్చనలు, సాంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు. శ్రీ ధనలక్ష్మి దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకోవటానికి పెద్ద సంఖ్యలో పద్మశాలీలు, మహిళలు వచ్చారు.వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చినట్లు అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పులిపాటి వెంకటేష్, అక్కల రవి, కాడిగ రాము, చైతన్య, నామాల శ్రీకాంత్, నిఖిల్ కుమార్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
- 1 view