హలియా,సెప్టెంబర్28(ప్రజా జ్యోతి): నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి అంగన్వాడీ టీచర్ల సమీక్ష సమావేశాన్ని అనుముల సెక్టార్ సిడిపిఓ గంధం పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం హాలియాలో శిశు సంక్షేమ శాఖ భవనంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిదిగా అనుముల మండల ఎంపీపీ పేర్ల సుమతి పురుషోత్తం హాజరై మాట్లాడారు.రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు.కార్యక్రమంలో భాగంగానే సమావేశానికి హాజరైన మహిళలందరూ బతుకమ్మలతో హాజరై బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రమాదేవి,ఆధార్ ఎన్రోల్మెంట్ ఆఫీసర్,అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
- 3 views