గుర్రంపోడ్:అక్టోబర్ 02(ప్రజా జ్యోతి)./...జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం సమాజంలోని ప్రతి పౌరుడు కృషి చేయాలని గుర్రంపోడు ఎంపీపీ,నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అన్నారు. మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భంగా ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహింస, సత్యాగ్రహాలనే ఆయుధాలుగా వాడి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టిన మహా నాయకుడు జాతిపిత మహాత్మా గాంధీ అని, గాంధీ ఆశయ సాధన కోసం సమాజంలోని ప్రతి పౌరుడు విశేషమైన కృషి జరిపి దేశాభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరి ధనుంజయ, మండల తెరాస అధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్ రావుల వెంకటేశ్వర్లు గౌడ్,మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- 2 views